తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి

Update: 2020-02-20 03:20 GMT
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 22 మంది మృతి చెందారు. తిర్పూరు జిల్లాలో బస్సును కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళ ఆర్టీసీ బస్సు తిర్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

అలాగే సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఐదుగురు నేపాల్ వాసులు ఉన్నట్టు గుర్తించారు.

Tags:    

Similar News