భారత్ లో రేపటి నుంచి రెడ్మీ నోట్ 8 విక్రయాలు
ఫోన్ ల ప్రపంచంలో ఇప్పుడు మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ ఫోన్ విక్రయాలను భారత్ లో రేపటి నుంచే ప్రారంభించనున్నారు.
ఫోన్ ల ప్రపంచంలో ఇప్పుడు మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ ఫోన్ విక్రయాలను భారత్ లో రేపటి నుంచే ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన షియోమీ తను తయారు చేసిన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 8ను తాజాగా భారత్ మార్కెట్లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. రేపటి నుంచి ఈ ఫోన్ను అమెజాన్, ఎంఐ ఆన్లైన్ స్టోర్లలో ఎక్స్క్లూజివ్గా విక్రయించనున్నారు. వీటిల్లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ గల ఫోన్ ధర రూ.9,999గా ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఉన్న ఫోన్ ధర రూ.12,999గా ఉంది.
ఈ ఫోన్లను కొన్న ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.249, రూ.349 రీచార్జిలపై 10 నెలల పాటు డబుల్ డేటాను పొందవచ్చు మంచి ఆఫర్ ను వీళ్ళు అందిస్తున్నారు. రెడ్మీ నోట్ 8 స్మార్ట్ఫోన్లో 6.39 ఇంచుల డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.