5జీ సేవలకు అనుమతులిచ్చాం
దిగ్గజ కంపెనీలు కూడా సంస్థలను సంస్థలు ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2019 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైంది.
దిగ్గజ మొబైల్ కంపెనీలు కూడా సంస్థలను సంస్థలు ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2019 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైంది.ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. 2014లో దేశంలో కేవలం రెండు మొబైల్ తయారీ కంపెనీలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 268 మొబైల్ తయారీ కంపెనీలు ఉన్నాయని వెల్లడించారు. దిగ్గజ కంపెనీలు కూడా సంస్థలను నెలకొల్పా అని ఆయన తెలిపారు. 5జీ వినియోగంపై కొన్ని మొబైల్ రంగ సంస్థలకు తాము అనుమతులు ఇచ్చామని, ఇంకా అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ఢిల్లీలోని ఏరోసిటీ వేదికగా ఈ సదస్సు నిర్వహించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సమావేశంలో 40 దేశాలకు నుంచి పలు టెలీ అనుంబంధ రంగాల చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సదస్సులో ఫైబర్ నెట్ , 5జీ టెక్నాలజీ, డిజిటల్ పరిజ్ఞానంలో మార్పులపై సెమినార్లు నిర్వహింస్తారు. ఈ సదస్సులో ప్రముఖ టెలికాం కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఫేస్ బుక్, గుగూల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
"In 2014 we had only 2 mobile manufacturing companies but now we have 268 mobile manufacturing companies including some of the biggest players." Shri Ravi Shankar Prasad @rsprasad #IMC2019 #ShotOnHonor pic.twitter.com/r6Xj8wmnUA
— IMC 2019 (@exploreIMC) October 14, 2019