కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ.. ఈ సాయంత్రం కేంద్రమంత్రుల బృందం భేటీ

Update: 2020-04-21 07:46 GMT

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు కొనసాగబోతోందీ లాక్‌డౌన్. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఈ సాయంత్రం కేంద్రమంత్రుల బృందం సమావేశం కానుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఈ సాయంత్రం 4గంటలకు భేటీ కానుంది. పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్న రాజ్ నాథ్ సింగ్, ఆపై సమావేశం వివరాలను ప్రధాని నరేంద్ర మోదీకి చేరవేయనున్నారు. రెడ్ జోన్లలో మరింత కఠినంగా ఉండేలా నిబంధనలను మార్చాలని, కంటైన్ మెంట్ జోన్లపై తీసుకోవాల్సిన చర్యలపైనా వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

Tags:    

Similar News