గిరిజనులతో చిందేసిన రాహుల్‌!

Update: 2019-12-27 13:48 GMT
రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డోలు పట్టుకుని స్టెప్పులు వేశారు. చత్తీస్‌గఢ్ లోని రాయపూర్‌లో జాతీయ గిరిజన నృత్యోత్సవాన్ని ప్రారంభించిన రాహుల్ వారితో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. చేతిలో డోలు పట్టుకొని వాయిస్తూ గిరిజనుల నృత్యాన్ని అనుకరిస్తూ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో పాటు చత్తీస్‌గడ్ సీఎం భూపేష్‌భగేల్, లోకసభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ నేతలు భక్త చరణ్ దాస్, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 24 రాష్ర్టాల నుంచి నృత్య కళాకారుల బృందాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. మూడు రోజుల పాటు ఈ గిరిజన నృత్యోత్సవం జరగనుంది.



Tags:    

Similar News