ఫిట్ ఇండియా@హెల్త్ ఇండియా

Update: 2019-08-29 07:41 GMT

ఆరోగ్య వంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్య భారతావనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, యోగా ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా 28 రాష్ట్రాలకు సంబంధించిన నృత్య రూపకాలను ప్రదర్శించారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వ్యాయమం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. దేశంలో డయాబెటీస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ... చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధుల బారిన పడుతున్నారంటూ గుర్తు చేశారు. ఆదాయం కంటే ఆరోగ్యంపైనే అధికంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచంలోని అగ్ర దేశాలు కూడా ప్రజారోగ్యంపై దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయంటూ తెలియజేశారు .

Full View 

Tags:    

Similar News