జమ్ముకశ్మీర్లోని కిష్టావర్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లోని జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. మృతుల ఆత్మలకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నానని క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విటర్ వేదికగా మోదీ విచారం వ్యక్తం చేశారు.
The accident in Jammu and Kashmir's Kishtwar is heart-wrenching. We mourn all those who lost their lives and express condolences to the bereaved families. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) July 1, 2019