ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి - ప్రధాని మోడీ
♦ సౌదీ కంపెనీలకు ప్రధాని మోడీ ఆహ్వానం ♦ సౌదీ మంత్రులతో మోడీ వరుస భేటీలు
భారత్లోని ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీ కంపెనీలను ఆహ్వానించారు. ఇంధన రంగంలో పదివేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రధాని మోదీ- సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అల్ సౌద్ సంయుక్తంగా తీవ్రవాదాన్ని ఖండించారు. భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. సౌదీలో పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే అంశాలపై వారు చర్చించారు.