దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తా: మోదీ

దేశ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానని ప్రధాని మోదీ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేటి ఉదయం దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు.

Update: 2019-08-15 02:33 GMT

దేశ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానని ప్రధాని మోదీ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేటి ఉదయం దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడూ దేశాభివృద్ధి నిమిత్తం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాఖీ పూర్ణిమ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులకు వందనం చేస్తున్నామన్న మోదీ... దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారనీ, అమర యోధులను ఈ దేశం గుర్తుంచుకుంటుందని అన్నారు. భారీ వర్షాలతో కొన్ని రాష్ట్రాలు నష్టపోయాయన్న మోదీ... వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు మెరుగైన చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు.

Tags:    

Similar News