షీలా దీక్షిత్ మృతి పట్ల ప్రధాని మోదీ స్పందన

Update: 2019-07-20 14:39 GMT

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. దీక్షిత్‌ మృతి పట్ల స్పందించారు. షీలా జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునేవారంటూ షీలా దీక్షిత్ గురించి పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో ఆమె ఎంతో విలువైన భాగస్వామ్యం అందించారని తెలిపారు. షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News