ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఇది : ప్రధాని మోదీ

Update: 2019-07-22 11:18 GMT

చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.'మన చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి! చంద్రయాన్‌ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ రోజు అని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది.. దీనికి ప్రతి భారతీయుడు సంతోషించాలి. రోవర్‌ చంద్రుని ఉపరితలంపై పదార్థాలను విశ్లేషించనుంది అని మోదీ పేర్కొన్నారు.


  

Tags:    

Similar News