ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయంపై.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ప్రముఖ న్యాయవాది ఎం ఎల్ శర్మ.. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 370 ఆర్టికల్ రద్దు చట్ట వ్యతిరేకం అని.. పిటిషన్లో పేర్కొన్నారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ పిిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం..తగిన సమయంలో విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.