అమరావతే, ఏపీకి శాశ్వత రాజధాని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి రాజధానిపై బలమైన కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. జీవీఎల్ నరసింహారావు, నాదెండ్ల మనోహర్ పవన్తో పాటు నిర్మలా సీతారామన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఆర్థిక అంశాలతో పాటు రాజధాని అంశంపైన కూడా నిర్మలా సీతారామన్ తో చర్చించామని పవన్ తెలిపారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించామన్నారు.