పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై కరోనా ఎఫెక్ట్.. అవార్డుల కార్యక్రమం వాయిదా

Update: 2020-03-14 13:31 GMT

కరోనా ప్రభావం పద్మ అవార్డుల ప్రదానోత్సవం పై పడింది. ఏప్రిల్ మూడో తేదిన రాష్ర్టపతి భవన్ లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా వేసింది కేంద్ర హోంశాఖ. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు అవార్డు గ్రహితలకు సమాచారం అందించారు కేంద్ర హోంశాఖ అధికారులు. గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అన్ని ప్రోగ్రామ్స్‌ని నిర్వాహకులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతిభవన్‌లో ఏప్రిల్ 3వ తేదీన జరగాల్సిన పద్మ అవార్డుల ఫంక్షన్‌ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.




 


Tags:    

Similar News