రాత్రంతా ఓ చిన్న గదిలో.. నేడు సీబీఐ కోర్టుకు చిదంబరం..

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ... రాత్రంతా సీబీఐ కేంద్ర కార్యాలయంలోనే గడిపారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చిదంబరాన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించిన అధికారులు రాత్రంతా అక్కడే ఉంచారు.

Update: 2019-08-22 04:57 GMT

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ... రాత్రంతా సీబీఐ కేంద్ర కార్యాలయంలోనే గడిపారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చిదంబరాన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించిన అధికారులు రాత్రంతా అక్కడే ఉంచారు. ఈ మధ్యాహ్నం సీబీఐ కోర్టులో చిదంబరంను హాజరుపర్చనున్న అధికారులు ... వారం పాటు కస్టడీ కోరనున్నారు. ఇదే సమయంలో చిదంబరంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్న చిదంబరం తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చిదంబరం అరెస్ట్ సయమంలో చెన్నైలో ఉన్న ఆయన తనయుడు విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ చేరున్నారు.  

Full View

Tags:    

Similar News