ముంబై ఓఎన్జీసీ ప్లాంట్లో అగ్నిప్రమాదం
ముంబై ఓఎన్జీసీ ప్లాంట్లో అగ్నిప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ ఏరియాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై ఓఎన్జీసీ ప్లాంట్లో అగ్నిప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ ఏరియాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీగా ఎగసిపడుతోన్న మంటలు.. చాలా దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి. 50 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.