ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో బిహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తి చేశాయని ఆమె వెల్లడించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్న విషయం విదితమే.