జీఎస్టీ విషయంలో Arun Jaitley ముందుచూపుతో వ్యవహరించారు : నిర్మలా సీతారామన్

Update: 2020-02-01 05:57 GMT
నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2020 బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మోడీ సర్కార్‌ ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఆర్థిక రంగం మూలాలు బలంగా ఉన్నాయన్నారు. అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా ,కొనుగోలు శక్తి పుంజుకునేలా బడ్జెట్‌ వుంటుందని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రికి అరుణ్‌ జైట్లీకి నివాళులర్పించారు. జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ ముందుచూపుతో వ్యవహరించారని చెప్పారు. ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైందని తెలిపారు. 

Tags:    

Similar News