ఎవరిని కలవడానికి వెళ్లినా ప్రధాని మోదీ వట్టి చేతులతో వెళ్లరు. అవతలి వారి ఇష్టాలు, మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా కానుకలు బహుకరిస్తుంటారు. తాజాగా మాల్దీవులు పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్కు క్రికెట్ బ్యాట్ను బహుమతిగా ఇచ్చారు. ఆ బ్యాట్ మీద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన జట్టు సంతకాలున్నాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతుండటం, సోహిల్ క్రికెట్ అభిమాని కావడం ఈ కానుక ఇవ్వడం వెనుక కారణం. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'క్రికెట్తో ముడిపడిన బంధం. నా స్నేహితుడు, అధ్యక్షుడు సోహిల్కు క్రికెట్ అంటే అమితాసక్తి. అందుకే ఆయనకు ప్రపంచ కప్ ఆడుతున్న భారత జట్టు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్ను బహుకరించాను' అని ఆయన ట్వీట్ చేశారు. రెండోసారి ప్రధాని పీఠం అధిష్ఠించిన మోదీ తన విదేశీ పర్యటనను పొరుగు దేశం మాల్దీవులతో ప్రారంభించారు.