మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!

Update: 2019-01-22 15:40 GMT

మోడీ ప్రభుత్వం త్వరలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? ఆర్థిక సంవత్సరాన్ని మార్చే యోచనలో ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం అమలవుతోంది. దీనిని జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు 12 నెలల కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా మార్పు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వ్యవసాయ ఉత్పత్తుల కాలాలకు అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా మార్పుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన నీతీ ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలన్న ప్రస్తావన వచ్చింది. అప్పట్లో దీన్ని ముఖ్యమంత్రులను సమర్ధించినట్టు వార్తలు కూడా వచ్చాయి. 

Similar News