గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సీఎంఓ కార్యాలయం వెల్లడించిన కొంతసమయానికే పారికర్ మృతిచెందారు. కొద్దిరోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు.