Manipur: ఉలిక్కిపడ్డ మణిపూర్.. పోలీసు అధికారి కాల్చివేత
Manipur: మోరే ప్రాంతంలో పోలీస్ అధికారిపై చొరబాటుదారుల కాల్పులు
Manipur: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్తో సరిహద్దులకు సమీపంలోని మోరే ప్రాంతంలో చొరబాటుదారులు ఘాతుకానికి పాల్పడ్డారు. హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి ఆనంద్పై కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసు అధికారిని చొరబాటుదారులు కాల్చిచంపడంపై సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రివర్గంతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వరల్డ్ కుకీ- జో ఇంటలెక్చువల్ కౌన్సిల్ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేబినెట్ ప్రతిపాదించింది.