మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ‌్యలు

మమతా బెనర్జీపై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సంచలన వ్యాఖ‌్యలు చేశారు.

Update: 2020-01-14 14:03 GMT
Mamata Banerjee File Photo

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ . మమతా బెనర్జీ దెయ్యాల రాణిగా అభివర్ణింస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ లంకకు కాపలాగా ఉంటే లంకిణి లక్షణాలు ఉన్నాయన్నారు. రాక్షసి, దెయ్యాల రాణి అని సంబోధించారు. పౌరసత్వ సవరణ చట్టం బెంగాల్ లో అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మాట్లాడుతూ.. మమతాబెనర్జీలో మానత్వ లక్షణాలు లేవని, ఆమె మహిళకాదని వేలాది మంది హిందూవులను పొట్టనపెట్టుకున్న వారిని ఆమె రక్షిస్తున్నారని ఆయన అన్నారు. ఆమె దెయ్యాలకు రాణి , రాజకీయ నాయకురాలు కాదు, ఓ దెయ్యానికి ఉండాల్సిన లక్షణాలు ఆమెకు ఉన్నాయని సురేంద్ర సింగ్ వ్యానించారు.

బెంగాల్ లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. బీజేపీ దేవతల పార్టీ అంటూ.. ఎస్పీ బీఎస్పీ , తృణమూల్ కాంగ్రెస్ రక్షస జాతికి చెంది పార్టీలని తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తుందని సురేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశారు.   

Tags:    

Similar News