కాసేపట్లో మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ
మరికాసేపట్లో మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ కూర్పులో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, శివసేనల నుంచి చెరో 12 మంది, కాంగ్రెస్ నుంచి10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 36 మంది కేబినెట్లో ఉండనున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ఠాక్రే ప్రమాణస్వీకారం చేసినా కేబినెట్ కూర్పు మాత్రం ఆలస్యమైంది. మూడు పార్టీల నేతలు తీవ్ర చర్చలు జరిపిన అనంతరం కేబినెట్ విస్తరణపై ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే డిప్యూటీ సీఎంల రేసులో అజిత్ పవార్, జయంత్ పాటిల్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, కేసీ పడ్వి, విజయ్ వాడేట్టివర్, యశోమతి ఠాకూర్లకు చోటు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.