ఒడిశాలో జులై 4న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజున చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పూరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జగన్నాథుడు కొలువైన ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఈ నెల 4న రథయాత్ర జరిగింది. ఆ రోజు దేశం నలుమూలల నుంచి లక్షల మంది వచ్చారు. సరిగ్గా రథయాత్ర సమయంలో ఓ అంబులెన్స్ వచ్చింది. అసలు రథయాత్ర అంటేనే జనసందోహం. అన్ని లక్షల మంది మధ్యలోంచి సైకిల్ కాదు, కదా అసలు మనిషి కూడా పక్కకు కదలాలంటేనే కష్టం. అలంటిది భక్తులు వెంటనే అప్రమత్తమై రోడ్డుకు అటూ ఇటూ తొలగిపోయి అంబులెన్సుకు దారి ఇచ్చారు. ఆ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లడానికి అక్కడున్న వారు మానవహారాన్ని కట్టారు. భక్తులంతా ఆ అంబులెన్సు వెళ్లడానికి ఇచ్చిన సహకారానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ''పూరీ రథయాత్ర కోసం 1200 మంది వాలంటీర్లు, 10 స్వచ్ఛంద సంస్థలు గంటల కొద్దీ సాధన చేశారు. దీని ఫలితంగా ఈ మానవ కారిడార్ను ఏర్పాట్లు చేయగలిగి, అంబులెన్సు వెళ్లేందుకు దారి ఇవ్వగలిగారు'' అని పోలీసులు.. పూరీ ఎస్పీ ట్విటర్ ఖాతాలో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
1200 volunteers, 10 organizations and hours of practice made this human corridor for free ambulance movement possible during Puri Rath Yatra 2019. pic.twitter.com/zVKzqhzYCw
— SP Puri (@SPPuri1) July 6, 2019