న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ విజయం

Update: 2020-02-11 08:21 GMT

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లెక్కలకి అనుగుణంగానే అమ్ ఆద్మీ పార్టీ రేసులో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ గెలుపొందారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆప్ ఆధిక్యతలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన ప్రముఖులు మాత్రం వెనుకబడ్డారు. మనీశ్‌ సిసోడియా ప్రతాప్‌ గంజ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగి కన్నా కంటే 1427 ఓట్ల వెనుకబడ్డారు. అసెంబ్లీ స్పీకర్‌ నివాస్‌ గోయెల్‌ సైతం షాద్రా నియోజకవర్గంలో వెనుకబడ్డారు.

Tags:    

Similar News