కర్ణాకట రాజకీయం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బీజేపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూస్తున్నామని ఆ తర్వాతే అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని యెడ్యూరప్ప అన్నారు.