కర్నాటకలో బలపరీక్షకు స్పీకర్ రమేష్ కుమార్ ముహూర్తం ఖరారు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలలోపు విశ్వాస తీర్మానంపై చర్చను ముగించి ఆరు గంటలలోపు బలపరీక్ష పూర్తి చేస్తామని స్పీకర్ ప్రకటించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బలపరీక్ష నిర్వహిస్తామంటూ స్పీకర్ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.