లోక్‌సభకు తాకిన కర్ణాటక సంక్షోభం

Update: 2019-07-08 08:55 GMT

కర్ణాటక సంక్షోభం లోక్‌సభకు తాకింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక సంక్షోభంలో బీజేపీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సభలో ప్రకటన చేసే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. సేవ్‌ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక సంక్షోభంలో తమ ప్రమేయం లేదని, కాంగ్రెస్‌లోనే రాజీనామాల పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మొదలుకొని అందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, రాజీనామాలు ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. 

Tags:    

Similar News