అక్టోబర్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నహాలు చేస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యాయాణాలతో కలిపి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కావడంతో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే ఈసీ నిర్వహించింది. జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.