గతేడాది డిసెంబరు 12న ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యంత ఖరీదైన వీరి పరిణయ వేడుక ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగింది. ఈ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఇక వివాహం అనంతరం ఇషా అంబానీ పలు విషయాలు వెల్లడించింది. ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వూలో.. 'పెళ్లి తరువాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అత్యంత సంతోషకరంగా ఉందని వెలడిందించింది. మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన ఏడేళ్లకు నేను, నా సోదరుడు ఆకాశ్ జన్మించాం. తామిద్దరం టెస్ట్ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా జన్మించాం. మాకు ఐదేళ్లు వచ్చే దాకా మా అమ్మ తన పూర్తి సమయాన్ని మాకోసమే వెచ్చించారు. అయితే తను చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు' అంటూ ఇషా చెప్పుకొచ్చారు.