రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

Update: 2019-12-07 10:40 GMT
రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఇవాళ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో జ‌రిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అత్యాచారాలకు రాజధానిగా భారత్‌ మారిపోయిందన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోందన్నారు.

భార‌త్ త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను ఎందుకు సుర‌క్షితంగా చూసుకోవ‌డం లేద‌ని విదేశాలు ప్రశ్నిస్తున్నాయ‌ని రాహుల్ విమ‌ర్శించారు. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు యూపీ రేప్ ఘ‌ట‌న‌తో లింకుంద‌న్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం మౌనం వీడ‌డం లేద‌ని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోందని మహిళలపై దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతోన్న విషయాన్ని ప్రతి రోజు చూస్తున్నామన్నారు.



Tags:    

Similar News