భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత

Update: 2019-10-10 13:32 GMT

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్‌ రైళ్లో.. అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 13 కిలోల బంగారం బిస్కేట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడ్డ గోల్డ్ బిస్కెట్స్‌ విలువ.. సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News