రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఉపరాష్ట్రపతిని నిర్మలాసీతారామన్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక సహాయ సహకారాలు కొనసాగించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఉపరాష్ట్రపతి ఆరా తీశారు.