కర్ణాటకలో మరింత తీవ్రమైన రాజకీయ సంక్షోభం

Update: 2019-07-08 04:46 GMT

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇవాళో, రేపో స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందించనున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్‌లో క్యాంప్ పెట్టారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అయితే, రాజీనామాలపై వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరోవైపు కర్ణాటక సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బెంగళూరులో ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకటంలో పడిన సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఎలాంటి షాక్ ఇవ్వనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News