సీఎం రక్షాబంధన్ కానుక.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

Update: 2019-08-15 09:20 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దిల్లీ మెట్రో, డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని ఆయన తెలిపారు. అక్టోబరు 29 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. మహిళలందరికీ ఉచిత ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించేలా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించినట్టుగానే అక్టోబర్ 29వ తేదీ నుంచి ఢిల్లీ రవాణా శాఖ పరిధిలో ఉన్న బస్సులో మహిళలందరికీ ఉచిత్ర ప్రయాణం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    

Similar News