మహారాష్ట్రలోని నాగ్పూర్లో కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు పేషెంట్లు రాత్రికి రాత్రి తప్పించుకుని పారిపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. చిరుతిళ్లు తినేందుకే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారని తర్వాత తిరిగి వార్డులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఐదుగురిలో ఒకరికి నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని మిగతావారి రిపోర్టులు రావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.