జెట్ ఎయిర్ వేస్పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఢిల్లీ, ముంబై సహా మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. దేశంలోని ప్రధాన కార్యాలయాలతో పాటు జెట్ ఎయిర్వేస్ ఛైర్మెన్ నరేశ్ గోయల్ ఇంటిపై కూడా దాడులు చేస్తున్నారు. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో దాడులు చేస్తున్నారు. జెట్ ఎయిర్ వేస్ సంస్థ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇటీవల సంస్థ ఛైర్మెన్ నరేశ్ గోయల్ విదేశాలకు వెళ్తుండగా అడ్డుకున్నారు.