మహారాష్ట్రాల్లో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. బీజేపీ, శివసేన పొత్తుతో మరోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్లో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ బొకార్ నియోజకవర్గంలో మెజార్టీలో ఉన్నారు. విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారుడు అమిత్ దేశ్ ముఖ్ లాతూర్లో సత్తా చాటారు. ఎక్కువగా కొంకణ్ ప్రాంతంలో శివసేన ఆధిక్యంలో ఉండగా ముంబై నగరం, మరఠ్వాడ ప్రాంతంలో బీజేపీ, శివసేన కూటమి ముందంజలో నిలిచింది.