ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సతేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అధిక జ్వరం ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. దీంతో నిన్న రాత్రి ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో తాను బాధపడుతున్నానని.. రక్తంలో ఆక్సిజన్ స్థాయి హఠాత్తుగా పడిపోయిందని మంత్రి ట్విటర్ ద్వారా ప్రకటించారు.
మంగళవారం ఉదయం ఆయన నుంచి శాంపిల్స్ను సేకరించి పరీక్షలు నిర్వహించగా, కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి త్వరగా కోలుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రార్థించారు.