ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఐసీయూ కు తరలించిన వైద్యులు. కరోనా వైరస్ లక్షణాలతో మూడరోజుల క్రితం ఢిల్లీ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ లో చేరారు సత్యేందర్ జైన్. జైన్కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత ముదరడంతో సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారని, అందుకే కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఢిల్లీలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఆరోగ్యమంత్రి ఆస్పత్రి పాలు కావడంతో.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నారు.