ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో పార్టీల్లో వణుకు !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, ఢిల్లీ ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో, పోలింగ్ పర్సంటేజ్ కనీసం 60శాతం కూడా దాటలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు 54శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
అయితే, తుది లెక్కల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ కొద్దిగా పెరిగే అవకాశముంటుంది. అయితే, గత ఎన్నికల్లో 67శాతం పోలింగ్ నమోదవగా ఇప్పుడు ఆ దరిదాపుల్లో కూడా ఓటింగ్ జరగకపోవడంతో ప్రధాన పార్టీల్లో వణుకు మొదలైంది. తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తోందన్న చర్చ జరుగుతోంది.