Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు అస్వస్థత.. రేపు కరోనా పరీక్షలు..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్లోకి వెళ్లారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు కేజ్రీవాల్. రేపు కేజ్రీవాల్కు కరోనా పరీక్షలు చేయనున్నారు వైద్యులు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 28,936 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది ప్రాణాలు కోల్పోయారు.