Delhi Assembly Election : అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వాతావరణం నెలకొనడంతో అధికారం కైవసం చేసుకునేందుకు బీజేసీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నారు. అధికారపార్టీ ఆమ్ ఆద్మీకూడా మరో సారి ఫిఠం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచారం ముందున్నారు సీఎం కేజ్రీవాల్ . మంగళవారం నామినేషన్లు ప్రారంభం కావడంతో..తొలి రోజే అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సారి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 15మందికి నిరాశ ఎదురైంది. 46 స్థాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పోటీ చేయనున్నారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి 8 మందికి మహిళలకు అవకాశం కల్పించింది. వచ్చే నెల(ఫిబ్రవరి ) 8న ఎన్నికలు జరగనున్నాయి. తుది ఫలితాతు ఫిబ్రవరి 11న వెలువడతాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఈ సారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ యోచింస్తుంది. కాగా.. కాంగ్రెస్ కంచుకోట ఢిల్లీలో ఎన్నికల్లో మళ్లి గెలవాలని ఆ పార్టీ దక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో 1.46 కోట్ల మంది అభ్యర్థలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఆప్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇదే.
Best wishes to all. Don't be complacent. Work v hard. People have lot of faith in AAP and u. God bless. https://t.co/JuuvriCoNG
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 14, 2020