ఏఎన్-32 ప్రమాద మృతులకు రాజ్‌నాథ్ నివాళి

Update: 2019-06-21 06:30 GMT

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన దుర్ఘటనలో వీర మరణం చెందిన 13 మంది పార్థివదేహాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. బుధవారం ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఐఏఎఫ్ గురువారం మరో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నది. ఈ నెల 3వ తేదీన గల్లంతైన వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు.

Tags:    

Similar News