పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. భారత్కు చెందిన 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాడిలో చనిపోవడం తాను కళ్లారా చూశానని ట్రంప్ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్కు సహకరిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్ చాలా బలంగా ఉందని, ఉగ్రవాదాన్ని పోత్సహించడం పాకిస్తాన్కు సరైన పద్ధతి కాదని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితిని సద్దుమనిగించేందుకు ఇరుదేశాలతో చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.