తమిళనాడులో ఇవ్వాళ ఒక్కరోజే 105 కేసులు
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇక తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇక తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో కలిపితే రాష్ట్రంలో కేసుల సంఖ్య 1477కు చేరుకుంది. ఇక కరోనాతో పోరాడి 15 మంది మృతి చెందారు. 118 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
వీటికి సంబంధించిన వివరాలను వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు 16 వేలకి చేరుకున్నాయి. 507 మంది మరణించగా, 2,302 మంది కోలుకున్నారు.