మహారాష్ట్ర గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

Update: 2019-06-14 09:13 GMT

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటి అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా విద్యాసాగర్‌తో మర్యాద పూర్వకంగా భేటి అయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి వివాదాలు రాకుండా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌తో భేటి ముగిసిన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్‌తో సమావేశం కానున్నారు. 

Tags:    

Similar News