ముఖ్యమంత్రి ఏంటి కొరడా దెబ్బలు తినడం ఏంటి అని అనుకుంటున్నారా అవును మీరు చదివింది నిజమే.. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కొరడా దెబ్బలు తిన్నారు.. సోమవారం ఓ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు.. ఆ ఆలయ సంప్రదాయం ప్రకారం అక్కడి దేవత ముందు కొరడా దెబ్బలు తింటే మంచిదని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం.. ఈ విషయం తెలుసుకున్న ఆ ముఖ్యమంత్రి ఆలయ పూజారి చేత కొరడా దెబ్బలు తిన్నారు.. మొత్తం ఆరు కొరడా దెబ్బలు తిన్నా ఆయన ఇక చాలు అన్నారు. పూజారి ఆయనని కొరడా దెబ్బలు కొట్టేముందు రెండు చేతులతో నమస్కరించి... అయిపోయాక కూడా నమస్కరించారు. ఆ తర్వాత భూపేశ్ భగేల్ ఆ పూజరిని దగ్గరికి తీసుకొని సంతోషంగా కౌగిలించుకున్నారు..