ఏపీకి న్యాయం చేస్తాం... కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హామీ!
ఏపీకి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చారు. కశ్మీర్, ఏపీ రెండు వేర్వేరు అంశాలు అని చెప్పారు.
ఏపీకి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చారు. కశ్మీర్, ఏపీ రెండు వేర్వేరు అంశాలు అని చెప్పారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ను యూటిగా చేశామని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందని ప్రకాష్ జవదేకర్ కితాబు ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే బీమాను రూ.5 లక్షలకు పెంచడం సామాన్యులకు ఇచ్చిన బహుమతన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని జవదేకర్ పేర్కొన్నారు.